Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివశివా... శవం గుడిలో ఉండ‌గానే పూజ‌లా?

నూజివీడు: అమ్మ‌వారి ఆల‌యంలో ఒక శ‌వం. అది ఉండ‌గానే అర్చ‌కుల అభిషేకాలు... పూజ‌లు... శివాశివా... ఇదేం క‌లికాలం...అని నివ్వెర‌పోతున్నారా... కృష్ణా జిల్లా నూజివీడులో ఇదే జ‌రిగింది. నూజివీడు కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయంలో అపచారం జ‌రిగింది. ఆలయంలో ఓ వ్యక

శివశివా... శవం గుడిలో ఉండ‌గానే పూజ‌లా?
, సోమవారం, 28 నవంబరు 2016 (13:55 IST)
నూజివీడు: అమ్మ‌వారి ఆల‌యంలో ఒక శ‌వం. అది ఉండ‌గానే అర్చ‌కుల అభిషేకాలు... పూజ‌లు... శివాశివా... ఇదేం క‌లికాలం...అని నివ్వెర‌పోతున్నారా... కృష్ణా జిల్లా నూజివీడులో ఇదే జ‌రిగింది. నూజివీడు కోటమహిషాసురమర్ధని అమ్మవారి ఆలయంలో అపచారం జ‌రిగింది. ఆలయంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థిత‌లో మృతి చెందాడు. 
 
అత‌ని మృతదేహం గుడిలో ఉండగానే, సంప్రోక్షణ ఏమీ చేయకుండా ఉదయం నుండి అమ్మవారి ఆలయం శివాలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించేశారు. తీరా శ‌వ పంచ‌నామాకు వ‌చ్చిన పోలీసులు ఈ విడ్డూరాన్ని చూసి, ఆల‌యంలో పూజలు నిలిపివేశారు. కేసు వివ‌రాలు ప్ర‌శ్నిద్దామంటే, ఆలయ కార్యనిర్వహణాధికారి ప‌త్తా లేడు. అయినా ఇలాంటి అప‌చారాల వ‌ల్ల నూజివీడు పట్టణానికి అరిష్టమంటూ, భ‌క్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 1000 నోటుతోనే ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్‌కు గండం...? అందుకే అదే చేస్తున్నారట...