Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్త వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య

అత్త వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:28 IST)
తల్లి తర్వాత తల్లితో సమానంగా చూసుకోవాల్సింది అత్త. అలాంటి అత్తే కోడలిని చిత్రహింసలు పెట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. 
 
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌లో నివాసముంటున్న కాలేషాకు, సోతిలకు 2010 సంవత్సరంలో వివాహమైంది. వీరికి జాను (5), జముద్దీన్‌ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం భర్త కాలేషా మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 
 
దీంతో కోడలు సోతి భర్త ఇంటిలోనే ఉంటోంది. అయితే అత్త బేగం తరచూ కోడలిని వేధిస్తూ ఉండేది. ఇంట్లో పనులన్నీ చెప్పడంతో పాటు బయటకు వెళ్ళి డబ్బులు సంపాందించుకుని రమ్మని వేధింపులకు గురిచేసేంది. దీంతో మనస్థాపానికి గురైన సోతి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై అలిగిన.. శ్రీకాళహస్తి పుష్కరిణిలో దూకి భర్త ఆత్మహత్య