Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ బెట్టింగు రాయుళ్ల అరెస్టు

క్రికెట్ బెట్టింగు రాయుళ్ల అరెస్టు
, శుక్రవారం, 27 మార్చి 2015 (09:34 IST)
భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున బెట్టింగులు జరిగాయి. లక్షల మొత్తంలో చేతులు మారాయి. భారత జట్టుపై ఎక్కువ ఆశలు పెట్టుకుని పూర్తిగా నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులు ఓ ముఠా నిర్వహిస్తున్న బెట్టింగు కార్యక్రమాన్ని బట్టబయలు చేసింది.  
 
ప్రపంచకప్లో భారత్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును యాంటీ గుండా స్క్వాడ్ గురువారం రాజమండ్రిలో రట్టు చేసింది. స్థానిక సీతంపేట మూలగొయ్యి సెంటర్ వద్ద ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం యాంటీ గుండా స్క్వాడ్కు అందింది.
 
దాంతో సదరు ఇంటిపై యాంటీ గుండా స్క్వాడ్ అధికారులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లతోపాటు రూ. 70 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.
 

Share this Story:

Follow Webdunia telugu