Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముద్రగడ అలా చేయడం సతీసహగమనాన్ని ప్రోత్సహించడమే: నారాయణ

ముద్రగడ అలా చేయడం సతీసహగమనాన్ని ప్రోత్సహించడమే: నారాయణ
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:50 IST)
కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షలో భార్యను కూర్చోబెట్టడం సతీసహగమనాన్ని ముద్రగడ ప్రోత్సహించడమేనని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్షకు కూర్చున్న ముద్రగడ.. సోమవారంతో తన దీక్షకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షలో భార్యను ఎందుకు కూర్చోబెట్టారని నారాయణ ప్రశ్నించారు. 
 
ఆపదమొక్కులవాడిలా హామీలిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఇరుక్కుపోతున్నారని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు కులస్తులను బీసీల్లో చేర్చడం అంత సులభమైన పని కాదని చంద్రబాబుకు బాగా తెలుసునని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలని, కొరడా ఝళిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu