Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుపై చేసే వ్యాఖ్యలను.. అది అసెంబ్లీపై వ్యాఖ్య అనుకుంటే ఎలా.. జగన్

చంద్రబాబుపై చేసే వ్యాఖ్యలను.. అది అసెంబ్లీపై వ్యాఖ్య అనుకుంటే ఎలా.. జగన్
, సోమవారం, 31 ఆగస్టు 2015 (10:56 IST)
చంద్రబాబుపై చేసే ప్రతి వ్యాఖ్యను అసెంబ్లీపై చేస్తున్నట్లు అనుకుంటే ఎలా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేసే సందర్భంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. 
 
మొదటగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణానికి సంతాపం ప్రకటించారు. తరువాత పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించే ప్రతిపాదన మొదలు పెట్టారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు కేటాయించిన ఘాట్‌కు కాకుండా పుష్కరఘాట్ వెళ్ళడం వలననే జరిగిందని వాదించారు.
 
అయితే మధ్యలోనే స్పీకర్ శివప్రసాద్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం మాత్రమేనంటూ మైక్ కట్ చేశారు. ఇలా కట్ చేస్తే ఎలా అంటూ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను స్పీకర్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, చంద్రబాబుపై చేసిన ప్రతి వ్యాఖ్యను శాసనసభను వ్యాఖ్యనించినట్లు భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు జరిగాయి. అనంతరం ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడారు. 
 

Share this Story:

Follow Webdunia telugu