Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతికి రానున్న సిఎం, కేంద్ర మంత్రులు... విద్యాసంస్థలకు శంఖుస్థాపన

తిరుపతికి రానున్న సిఎం, కేంద్ర మంత్రులు... విద్యాసంస్థలకు శంఖుస్థాపన
, శనివారం, 28 మార్చి 2015 (10:03 IST)
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరీ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి, శ్రీసిటీలలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు శంఖుస్థాపన చేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
 ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు మంజూరయ్యాయి. జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సంస్థలకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో తిరుపతి రానున్నారు. ఇక కేంద్రమంత్రులు మధ్యాహ్నం వచ్చే విమానాలలో తిరుపతి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా విద్యాసంస్థలు నెలకొల్పే ప్రాంతాలుకు వెళ్లతారు. 
 

Share this Story:

Follow Webdunia telugu