Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు ఇకపై నిద్రలేని రాత్రులే : చిరంజీవి విసుర్లు

చంద్రబాబుకు ఇకపై నిద్రలేని రాత్రులే : చిరంజీవి విసుర్లు
, ఆదివారం, 31 ఆగస్టు 2014 (16:43 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై ఇకపై నిద్రలేని రాత్రులు గడపక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇష్టం వచ్చిన రీతిలో హామీలిచ్చిన చంద్రబాబు ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
రుణమాఫీ చేయకుంటే టీడీపీ గత పాలనలో జరిగిన రైతు ఆత్మహత్యల పర్వం పునరావృతం అవుతుందని అన్నారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు, పంట రుణాలనే మాఫీ చేస్తామని అంటున్నారని ఆరోపించారు.
 
అలాగే, ఎన్నికల సమయంలో కాపు కులస్తులపై హామీల వర్షం కురిపించి, తాజా బడ్జెట్‌లో మాత్రం స్వల్ప కేటాయింపులతో సరిపెట్టారని దుయ్యబట్టారు. కేవలం కాపు కులస్తులు ఓట్ల కోసమే చంద్రబాబు తప్పుడు హామీలు గుప్పించారన్న విషయాన్ని ప్రతి వ్యక్తి గ్రహించాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu