Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి ఫ్యామిలీ నుంచి 'మెగా ఎయిర్ లైన్స్'

చిరంజీవి ఫ్యామిలీ నుంచి 'మెగా ఎయిర్ లైన్స్'
, బుధవారం, 23 జులై 2014 (12:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కొత్త విమానయాన సంస్థ రానున్నట్టు సమాచారం. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేశారని, అయితే దీనికి ఇప్పడు ఎన్డీయే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
అలాగే పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా మంజూరైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు ఎన్ఓసీ ఇచ్చినట్టు తెలిసింది. 'టర్బో మెగా' పేరుతో ఏర్పాటయ్యే ఈ ఎయిర్‌లైన్స్ డైరక్టర్లుగా రాంచరణ్, వంకాయలపాటి ఉమేష్‌లు వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఈ వ్యాపారాన్ని పూర్తిగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ చూసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu