Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ జైలుకెళ్లడంతో జగన్‌కు భయం పట్టుకుంది: చినరాజప్ప

అమ్మ జైలుకెళ్లడంతో జగన్‌కు భయం పట్టుకుంది: చినరాజప్ప
, శనివారం, 25 అక్టోబరు 2014 (12:35 IST)
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైలుకెళ్లడంతో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు.
 
అక్రమాస్తుల కేసులో జయమ్మకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో జగన్‌ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారని చినరాజప్ప తెలిపారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. కేవలం రూ.66 కోట్ల మేర అక్రమ సంపాదనకే జయకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా పడిన వైనాన్ని ప్రస్తావించారు. 
 
ఇక వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్‌కు కూడా శిక్ష తప్పదని చెప్పారు. జయకు జైలు శిక్ష నేపథ్యంలో జగన్‌లోనూ భయం నానాటికీ పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu