మూడేళ్ళ బాలుడికి మద్యం తాగించిన వైనం... ఇద్దరి అరెస్టు
ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి మద్యం తాగించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి మద్యం తాగించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
చెన్నై, అంబత్తూరు మేనాంబేడు వీవోసీ నగర్ రెండో వీధికి చెందిన ఓ మహిళ.. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి తన మూడేళ్ళ బిడ్డతో కలిసి జీవిస్తోంది. ఆమె ఇంటి ఎదురుగా సెల్వం అనే వ్యక్తి నివశిస్తున్నాడు. ఈయన శుక్రవారం తన స్నేహితులతో కలిసి ఇంట్లోనే మద్యం సేవించాడు. శుక్రవారం ఈమె ఇంట్లో పని చేసుకుంటుండగా, ఇంటిబయట మూడేళ్ళ చిన్నారు ఆడుకుంటున్నాడు.
అదేసమయంలో పక్కింటి మూడేళ్ళ చిన్నారి ఆడుకోవడం గమనించిన సెల్వం ఆ చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. దీనిని చూసిన తల్లి ఆడుకునేందుకు తీసుకువెళ్లాడనుకుంది. ఎంతసేవటికి సెల్వం తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో ఆమె స్థానికుల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించింది.
సెల్వం తన స్నేహితులతో కలసి కుమారుడికి మద్యం తాగించడం చూసి దిగ్ర్భాంతి చెందింది. కోపోద్రేకులైన స్థానికులు సెల్వంకు దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని మద్యం మత్తులో ఉన్న సెల్వం, అతని స్నేహితులు పళని, రామును అరెస్ట్ చేశారు.