Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనుమడిని చూసి మురిసిపోయిన తాత చంద్రబాబు!

మనుమడిని చూసి మురిసిపోయిన తాత చంద్రబాబు!
, ఆదివారం, 29 మార్చి 2015 (08:23 IST)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు (వారసుడిని)ని చూసి మురిసిపోయారు. శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని రాత్రికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. 
 
అక్కడ ఆయన తన మనవడిని ఆప్యాయంగా హత్తుకుని సంబరపడ్డారు. కాగా, చంద్రబాబు కుమారుడు లోకేష్, నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిల జంటకు శనివారం, ఉగాది పర్వదినం రోజు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూల్ కారణంగా మనుమడిని చూసేందుకు వెళ్లలేని చంద్రబాబు శనివారం వెళ్లి చూశారు. 

Share this Story:

Follow Webdunia telugu