Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన....

విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన....
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (18:17 IST)
విశాఖ జిల్లాలో శ‌నివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నేటి సాయంత్రం నుంచి విశాఖలో చంద్రబాబు బిజీబిజీగా ఉండ‌నున్నారు. విశాఖ జిల్లాలో ఏడు కార్యక్రమాలకు  ముఖ్యమంత్రి చంద్రబాబు హజరుకానున్నారు.
 
పోలీసు కమిషనర్ కార్యాలయంలో నూతన భవనాన్ని, ట్రాఫిక్ పోలీస్ కమాండ్ కంట్రొల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. తొలి దశలో 47 కూడళ్లలో 200 అత్యాధునిక హెఛ్‌డీ సీసీ కెమేరాలను అమ‌ర్చారు.చీకట్లో జరిగే దృశ్యాలు స్పష్టంగా రికార్డు చేయగలవని పేర్కొన్నారు. ఓక్కో కూడలి వద్ద 2.8 లక్షలు విలువ చేసే కెమేరాలు ఏర్పాటు చేశారు.
 
విశాఖపట్నం పాండురంగపురంలో ఉడా ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ ను శ‌నివారం  ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మాల‌లో హోం మంత్రి ఎన్.చినరాజప్ప, డిజిపి జె.వి.రాముడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాదరెడ్ఢి, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరసన జ్వాలలు ఉత్తుత్తివే.. అంతా ఓ తమాషా : డోనాల్డ్ ట్రంప్