Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతివారం కోర్టుకెళతావు... హరీశ్, నువ్వు ఎక్కడ కలిశారో చెపుతా... చంద్రబాబు ఫైర్

ప్రతివారం కోర్టుకెళతావు... హరీశ్, నువ్వు ఎక్కడ కలిశారో చెపుతా... చంద్రబాబు ఫైర్
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:25 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలతో సభ అట్టుడుకుతోంది. ఒక దశలో వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని విపక్షాన్నుద్దేశించి మాట్లాడుతూ... పవిత్రమైన దేవాలయం వంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారు. 
 
కేసీఆర్‌తో కుమ్మక్కై జగన్ మోహన్ రెడ్డి నాపై బురద చల్లుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్ర ముఖ్యమంత్రి జరిపే కుట్రలో జగన్ మోహన్ రెడ్డి భాగస్వామ్యమయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో హరీశ్ రావు, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ కలిశారో మా వద్ద సమాచారం ఉందని అన్నారు. 
 
అవినీతి అంతానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నామనీ, ఎవరినీ వదిలిపెట్టమనీ, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతామని అన్నారు. మర్రి చెన్నారెడ్డి నుంచి వైఎస్సార్ వరకూ చూశా... జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నాయకుడిని నా 30 ఏళ్ల రాజకీయాల్లో చూళ్లేదంటూ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu