Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ నాయన నుంచే కాలేదు... నీ నుంచి ఏమవుతుంది?

మీ నాయన నుంచే కాలేదు... నీ నుంచి ఏమవుతుంది?
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:16 IST)
ఇదిగో..! జగన్ నీ నుంచి ఏమవుతుంది. మీ నాయనే ఏమి చేయలేకపోయారు.. నేను చాలా మందిని చూశా.. మీ నాయన 25 చార్జీ షీట్లు వేశాడు.  ఏం చేశారు.. ఇక చాలు మర్యాదగా వ్యవహరించుకో.. మంచి నాయకుడనిపించుకుంటావ్... అంటూ చంద్రబాబు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ఆరోపించారు. మీరు మనుషులా...! అంటూ మండిపడ్డారు.
 
ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా జగన్ మాట్లేడే సమయంలో మంత్రి కామినేని శ్రీనివాస రావు జగన్‌పై విమర్శలు చేశారు. దీనిపై నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనపై విమర్శలు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 
 
వైసీపీ సభ్యులు మనుషుల్లా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. హూందా వ్యవహరించాలని అన్నారు. అప్పట్లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కనీసం తనక మైకు కూడా రాలేదని, ప్రస్తుతం తమ హయాంలో జగన్‌కు మైకైనా వస్తోందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ సభ్యులు నిగ్రహంతో వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu