Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
, గురువారం, 22 అక్టోబరు 2015 (15:47 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గురువారం అనుమతిచ్చింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.662.86 కోట్లుగా ఉంది. 
 
ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 26 పట్టణాలకు అమృత్ పథకం కింద పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం కేంద్రం నిధులు ఇవ్వనుంది. కేంద్రం వాటాలో భాగంగా రూ.331.43 కోట్లు విడుదల చేసింది. అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 26 పట్టణాలకు మొదటి విడతగా రూ.66.29 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu