Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో కూలిన బీఎస్ఎఫ్ విమానం... నలుగురి దుర్మరణం

ఢిల్లీలో కూలిన బీఎస్ఎఫ్ విమానం... నలుగురి దుర్మరణం
, మంగళవారం, 22 డిశెంబరు 2015 (11:46 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బీఎస్ఎఫ్‌కు చెందిన విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో పది మంది ఉన్నారు. సాంకేతిక నిపుణులను రాంచీ తీసుకెళుతుండగా సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా, 15 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. విమానంలో మొత్తం 10 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu