Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండేళ్ళు సహజీవనం... ఆపై పరార్... ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన

రెండేళ్ళు సహజీవనం... ఆపై పరార్... ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
, శుక్రవారం, 3 జులై 2015 (06:38 IST)
నాలుగేళ్ళు ప్రేమించి... రెండేళ్లు సహజీవనం చేసిన తరువాత ఆ ప్రియుడికి ప్రియురాలుపై మోజు తగ్గింది. డిఎస్సీ పరీక్షలు రాసి వస్తానంటూ కహానీలు చెప్పి ఆపై పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పి.లేవిడి గ్రామానికి చెందిన పెద్దింటి లిజి (22), గుమ్మ గ్రామానికి చెందిన నిమ్మక చంద్రకాంత్ (23) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.

పార్వతీపురంలో వీళ్లిద్దరూ రెండేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. డీఎస్సీ పరీక్షల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన చంద్రకాంత్ మే నెలలో డీఎస్సీ పరీక్షకు వెళ్తున్నట్టు చెప్పి పరారయ్యాడు. లిజి పలుమార్లు ఆయన జాడ కోసం తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో నిమ్మక చంద్రకాంత్ స్వగ్రామం గుమ్మకు వెళ్లింది.

ఆచూకీ తెలిపాలని అతని తల్లిదండ్రులు ప్రసాద్, శాంతిలను వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇంటిముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి ప్రియుడే కావాలని పెద్దింటి లిజి ఫిర్యాదు మేరకు నీలకంఠాపురం ఎస్ఐ షేక్ ఫక్రుద్రీన్ కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu