జగన్-ముద్రగడ తోడు దొంగలు.. చిరంజీవి కాపు సమస్యలపై మాట్లాడారా?: బోండా ఉమ
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. కాపుల కోసం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కాపు సమస్యలపై ఎప్పుడ
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. కాపుల కోసం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కాపు సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా? అని మెగాస్టార్ని కూడా నిలదీశారు.
ముద్రగడ, జగన్ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. కాపుల సమస్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్, వైసీపీకి లేదని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన కుమారుడు, కోడలు పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీని కోరామని బోండా ఉమా తెలిపారు.
ఇదిలా ఉంటే కాపుల రిజర్వేషన్ కోసం దీక్ష చేపట్టిన ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై 2వ బులిటెన్ను డా. రమేష్, సీఎస్ఎస్ శర్మ విడుదల చేశారు. వైద్యానికి ముద్రగడ నిరాకరించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. చికిత్సకు సహకరించాలని ముద్రగడ కుటుంబాన్ని కోరినట్లు చెప్పారు. బలవంతంగా వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.