Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తీశ్వరునికి మంత్రి బొజ్జల పట్టువస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తీశ్వరునికి మంత్రి బొజ్జల పట్టువస్త్రాల సమర్పణ
, ఆదివారం, 6 మార్చి 2016 (18:01 IST)
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరునికి ఏపి ప్రభుత్వం తరపున అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వెనుక ఉన్న త్రినేత్ర అతిథి గృహం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకెళ్లి వేదపండితులకు పట్టు వస్త్రాలను మంత్రి బొజ్జల దంపతులు అందజేశారు. 
 
11 రోజుల పాటు సాగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతి యేటా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత మంత్రి బొజ్జల ముక్కంటీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దేవస్థానం అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu