Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ సీన్లోకి వచ్చిన విష్ణుకుమార్.. జగన్‌తో ప్రత్యేక భేటీ ఎందుకు?

మళ్లీ సీన్లోకి వచ్చిన విష్ణుకుమార్.. జగన్‌తో ప్రత్యేక భేటీ ఎందుకు?
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (09:26 IST)
బీజేపీ నేత, ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ మళ్లీ సీన్లోకి వచ్చారు. వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విష్ణుకుమార్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్ చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ప్రత్యేక హోదాపై చర్చలో మాట్లాడేందుకు సర్కారు అవకాశమిస్తుందని విపక్ష నేతకు ఆయన సూచించారు. అయితే ఇప్పటికే ఒంటి గంట దాటిపోయిందని, ఇక తనకెప్పుడు మాట్లాడే అవకాశమిస్తారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
 
తాను అధికార పక్షంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చిన విష్ణుకుమార్, నేరుగా అధికార పక్షం వద్దకెళ్లారు. ప్రతిపక్ష నేత వాదనను టీడీపీ నేతల ముందు పెట్టారు. వారు కూడా విష్ణుకుమార్ రాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని జగన్‌కు చేరవేసిన విష్ణకుమార్ రాజు పరిస్థితిని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాతే సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించారు. 
 
కాగా విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో రాయబారాలు నడుపుతూ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే మునుపటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో ఆయన అధికార పక్షాన్ని ఒప్పించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu