Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌తో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు రహస్య భేటీ.. 20 నిమిషాల పాటు చర్చ!

జగన్‌తో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు రహస్య భేటీ.. 20 నిమిషాల పాటు చర్చ!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (20:59 IST)
షాకింగ్ న్యూస్. బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ జగన్మోహన్ రెడ్డితో రహస్య భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో అసెంబ్లీ ఛాంబర్‌లో విష్ణుకుమార్ 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. విశాఖపట్టణం మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో వైసీపీతో మైత్రి కోసం ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వైఎస్సార్ పరిపాలనను అసెంబ్లీలో ప్రశంసించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైకాపా సభ్యుడు మాట్లాడుతూ, తెలుగుదేశం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తే, ప్రతిగా అసలు అవినీతికి ఆద్యుడే వైఎస్ అంటూ, అధికార పక్షం ప్రత్యారోపణలు చేసింది. సభలో గందరగోళం నెలకోవడంతో స్పీకర్ కల్పించుకొని "ఎంచుకున్న అంశాన్ని వీడకుండా విమర్శలు చేసుకోవచ్చు. కాని ఈ తమలపాకు తలుపుచెక్క మాటలొద్దు" అని తరువాతి ప్రశ్నకు వెళ్ళిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu