Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి ప్రత్యేక హోదా.. ఉండవల్లికి మాట్లాడే అర్హత లేదు!

ఏపీకి ప్రత్యేక హోదా.. ఉండవల్లికి మాట్లాడే అర్హత లేదు!
, శుక్రవారం, 30 జనవరి 2015 (13:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత ఉండవల్లి అరుణ్ కుమార్‌కి లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు శుక్రవారం మండిపడ్డారు. గతంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి లోక్‌సభలో ఏపీ గురించి కనీసం 5 నిమిషాలు కూడా ప్రసంగించలేదన్నారు. 
 
ఉండవల్లి తన జ్ఞానాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ రాష్ట్రాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu