Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగపూర్ కాదు.. చిత్తూరు నాయుడిగానైనా ఉండాలి: అంబటి

సింగపూర్ కాదు.. చిత్తూరు నాయుడిగానైనా ఉండాలి: అంబటి
, గురువారం, 20 నవంబరు 2014 (12:32 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని అంబటి ఎద్దేవా చేశారు.
 
రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని అంబటి అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలకకు ప్రాణసంకటం అన్నట్లుందని చెప్పారు.  
 
చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలన్నారు. ఆయనను రైతుద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేస్తుందని అంబటి స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu