Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరాధ్య చనిపోయిందా.. ఎపుడని ప్రశ్నిస్తున్న తల్లి సాహితి!

ఆరాధ్య చనిపోయిందా.. ఎపుడని ప్రశ్నిస్తున్న తల్లి సాహితి!
, గురువారం, 27 నవంబరు 2014 (10:42 IST)
తమ ముద్దుల గారాలపట్టి ఆరాధ్య చనిపోయిందా.. ఎపుడు.. అని ఆరాధ్య తల్లి సాహితి ప్రశ్నిస్తోంది. తన కుమార్తె చనిపోయినట్టు వార్త వినిడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైంది. ఈ షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి... ఇకలేదనే విషయాన్ని... ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
 
ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు. ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. 
 
అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు.  ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu