Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలు పత్తికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి!

కర్నూలు పత్తికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి!
, శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:58 IST)
కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తికొండలో నివాసముండే 10 మంది చిరు వ్యాపారులు వ్యాపారం కోసం వివిధ గ్రామాలకు వెళ్ళడానికి ఆటోలో బయల్దేరారు. 
 
పత్తికొండ శివారులోని ఆదోని రోడ్డులో గుత్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు నలుగురు మహిళలు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu