Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనిపోయాక నువ్వు నాకు బొట్టు పెట్టి గాజులు తొడుగు... ప్రియురాలి సెల్ఫీ వీడియో

చనిపోయాక నువ్వు నాకు బొట్టు పెట్టి గాజులు తొడుగు... ప్రియురాలి సెల్ఫీ వీడియో
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (15:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కావలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన మాధవి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భాను అనే యువకుడు తనను మోసం చేశాడని.. తాను ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియోలో తెలిపింది. తనకు జీవితంపై ఆశలేదని.. తాను ఎవరికీ ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. 
 
వివరాల్లోకి వెళితే.. కావలికి చెందిన మాధవి డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. భాను తేజ నెల్లూరులోని ఓ బంగారం దుకాణంలో పని చేస్తున్న సమయంలో మాధవికి పరిచమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించుకుంటున్న సమయంలో భాను తేజ మాధవి తల్లి శాంతమ్మ పేరు మీద ఉన్న పొలం, ఇల్లు తనకు రాసివ్వాలని కోరాడు. తల్లికి మాధవి ఆ విషయం చెప్పింది. పెళ్లయిన తర్వాత రాసిస్తానని శాంతమ్మ చెప్పింది. అందుకు భాను అంగీకరించలేదు. దీంతో మాధవి మనస్తాపానికి గురై తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోలో తమ పెళ్లి విషయంలో భాను ఇక ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. భగవంతుడి దృష్టిలో తామిద్దరికీ ఎప్పుడో వివాహం జరిగిందని, ఈ జన్మకు అది చాలునని చెప్పింది. తనను ఎవరూ తప్పు పట్టవద్దని మాధవి కోరింది. 
 
తన సూసైడ్ నోట్‌ను మూడు నిమిషాల సేపు వీడియో రికార్డ్ చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకోలేకపోయాం, కనీసం తాను చనిపోయిన తర్వాత తన శవానికి గాజులు వేసి, తన నుదుట బొట్టు పెట్టాలని ఆమె తన చివరి కోరికగా భాను తేజకు వీడియో రికార్డింగ్ ద్వారా తెలిపింది. మాధవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లీచెల్లీ తనను క్షమించాల్సిందిగా కోరింది.
 
మాధవి ఫోన్‌లో వీడియో లభించడంతో భాను తేజపై ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మరణానంతరం మాధవి వీడియోను సోదరి జానకి పరిశీలించింది. దాంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన భాను పెళ్ళి చేసుకోలేదని.. తమ పెళ్ళికి భాను కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే మాధవి ఆత్మహత్యకు పాల్పడిందని మాధవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu