ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పురానాపూల్ డివిజన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారని కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో సోమవారం సౌత్ జోన్ డీసీసీ ఎదుట అసదుద్దీన్ లొంగిపోయారు. అసదుద్దీన్ వెంట ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి తీవ్రపరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు తగుజాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఒవైసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన ఒవైసీనీ అటునుండి నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అసదుద్దీన్ అభ్యర్థన మేరకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.