Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ.. కేసీఆర్ ఇంట్లో లంచ్

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మధ్యాహ్నం లంచ్ చేశారు.

హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ.. కేసీఆర్ ఇంట్లో లంచ్
, ఆదివారం, 24 జులై 2016 (16:27 IST)
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మధ్యాహ్నం లంచ్ చేశారు. 
 
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్ అంతర్జాతీయ యూనివర్శిటీ ప్రారంభోత్సవం నిమిత్తం అరుణ్ జైట్లీ ఇక్కడికి వచ్చారు. వర్శిటీ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయన లంచ్ చేశారు. 

ఒక రోజు పర్యటన కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. రాత్రి పార్క్‌హయత్‌లో బసచేసిన ఆయన ఆదివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 మంది విద్యార్థినిలపై ఏడుగురు ఉపాధ్యాయులు లైంగిక దాడి చేశారు.. ఎక్కడ?