Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీని అరకుకు ఆహ్వానించా... ఎంపీ కొత్తపల్లి గీత

అరకు ఎంపీ కొత్తపల్లి గీత బుధ‌వారం ప్రధాని మోదీని క‌లిశారు. అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు సహా ప్రోత్సాహం కావాలని ప్రధాని మోదీని కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు. అరకు పర్యాటక ప్రాంతాలతో బ్రోచర్‌ను మోదీకి అందజేశారు. అరకుకు మంజూరైన గ్లాస్ ట్రైన్ ప్రారంభో

ప్రధాని మోదీని అరకుకు ఆహ్వానించా... ఎంపీ కొత్తపల్లి గీత
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (18:52 IST)
అరకు ఎంపీ కొత్తపల్లి గీత బుధ‌వారం ప్రధాని మోదీని క‌లిశారు. అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు సహా ప్రోత్సాహం కావాలని ప్రధాని మోదీని కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు. అరకు పర్యాటక ప్రాంతాలతో బ్రోచర్‌ను మోదీకి అందజేశారు. అరకుకు మంజూరైన గ్లాస్ ట్రైన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ వస్తే అరకు పర్యాటకం ఊపందుకుంటుందని కొత్తపల్లి గీత అన్నారు. 
 
పర్యాటకంతో అరకు ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొత్తపల్లి గీత పేర్కొన్నారు.అరకు నియోజకవర్గంలో రోడ్లు, టెలీకమ్యూనికేషన్ మెరుగుపర్చడానికి ప్రధాని మోదీని నిధులు అడిగానని,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా రోడ్లు వేయించవచ్చని కొత్తపల్లి గీత  తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రాల యువతకు ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చార‌ని, అరకు గిరిజన యువతకు కూడా మినహాయింపులు ఇవ్వాలని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని  కొత్తపల్లి గీత కోరారు.యువతకు ఉపాధి పెరిగితేనే మావోయిస్టు ప్రాబల్యం తగ్గుందని ప్రధాని మోదీకి కొత్తపల్లి గీత  వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగత్ సింగ్ ఓ ఉగ్రవాది.. ఢిల్లీ యూనివర్శిటీ పాఠ్యపుస్తకంలో ముద్రణ!