Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతా.. నో.. ఛాన్స్: నరసింహన్

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతా.. నో.. ఛాన్స్: నరసింహన్
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:46 IST)
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనటం అవాస్తవమని, హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. 
 
హైదరాబాద్‌లో నివశించే సీమాంధ్ర ప్రజానీకం అభద్రతాభావంలో జీవిస్తున్నట్టు వస్తున్న మీడియా కథనాలపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం ఢిల్లీలో స్పందించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతా భావం ఉందని అనడం అవాస్తవమని, అసలు అలా అని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. 
 
సెక్షన్లు 9, 10పై ఎలాంటి వివాదం లేదని, వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu