Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదా కోసం ఆత్మ బలిదానం చేసిన మునికోటి... పవన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఎగసిపడిన సమయంలో.. ప్రత్యేక హోదా రాదనీ భావించి తిరుపతిలో పెట్రోల్ పోసుకుని మునికోటి అనే యువకుడు ఆత్మ బలిదానం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది నిండింది. మునికోటి చనిపోయిన సమయంలో రాజక

ప్రత్యేక హోదా కోసం ఆత్మ బలిదానం చేసిన మునికోటి... పవన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం
, మంగళవారం, 9 ఆగస్టు 2016 (17:52 IST)
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఎగసిపడిన సమయంలో.. ప్రత్యేక హోదా రాదనీ భావించి తిరుపతిలో పెట్రోల్ పోసుకుని మునికోటి అనే యువకుడు ఆత్మ బలిదానం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది నిండింది. మునికోటి చనిపోయిన సమయంలో రాజకీయ పార్టీలు ఎవరికివారు ఆ భాగ్యునిపై తెగ సానుభూతి చూపించారు. బంద్‌లు కూడా నిర్వహించారు. ఆ తరువాత ఏ పార్టీ అతని కుటుంబాన్ని పట్టించుకున్నా పాపాన పోలేదు.
 
ఈ క్రమంలో మునికోటి కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల మేర ఆర్థిక సామాన్ని అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ సాయంతో పవన్ మరోమారు తన సహృదయతను చాటుకున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులందరీ తీరుకు తాను భిన్నమని పవన్ మరోసారి నిరూపించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్సర్ రోగి ఊరి నుంచి వెళ్లిపోలేదనీ సాఫ్ట్‌డ్రింక్ బాటిల్స్‌తో తల పగులగొట్టారు!