జనసేన అధినేత, అగ్ర నటుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరూ రైతులనూ ఒప్పిస్తామని, వారి ఇష్ట ప్రకారమే భూములు తీసుకుంటామని, ఎవరినీ బలవంతం పెట్టబోమని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి భూసేకరణ వద్దనే అంటున్నారని, అయినా సమయం ముంచుకొస్తుండటంతో తాను భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయించానని నారాయణ అన్నారు.
భూసేకరణకు చంద్రబాబు వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమీకరణ విధానంలోనే రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలన్నదే బాబు అభిమతమని.. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరు రైతులను, ఒప్పించి భూముల్ని తీసుకుంటామని చెప్పారు. గ్రామకంఠాలపై రైతుల్లో ఆందోళన వద్దని, సోమవారంలోగా సమస్యను పరిష్కరిస్తామని నారాయణ హామీ ఇచ్చారు.