Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 10,330 టీచర్ పోస్టులు భర్తీ.. 19 వేల కోట్లు కేటాయింపు.. గంట వెల్లడి..!

ఏపీలో 10,330 టీచర్ పోస్టులు భర్తీ.. 19 వేల కోట్లు కేటాయింపు.. గంట వెల్లడి..!
, శనివారం, 28 మార్చి 2015 (10:55 IST)
ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.
 
అందులోభాగంగా డిఎస్సీ ద్వారా 10,330 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ 19 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు. కేంద్రం విడుదల చేసిన 225 కోట్ల రూపాయల్లో శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీకి 20 కోట్లు, చిత్తూరు జిల్లాలోని ఐదు డిగ్రీ కళాశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu