Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలి: జగన్

నేడే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలి: జగన్
, శనివారం, 1 నవంబరు 2014 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదినే నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జూన్ 2వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం నవంబర్ ఒకటో తేదినే రాష్ట్ర అవతరన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు.
 
అలాగే  ఆంధ్ర రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ శనివారమే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu