Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

​బాపట్లలో ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఏపీ సీఎం చంద్రబాబు

గుంటూరు : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. పెదనందిపాడు, పముడివారిపాలెం, బాపట్ల, కాకనూరు ప్రాంతాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రెడ్డిగూడెంలోని రహదార

​బాపట్లలో ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఏపీ సీఎం చంద్రబాబు
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (21:24 IST)
గుంటూరు : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. పెదనందిపాడు, పముడివారిపాలెం, బాపట్ల, కాకనూరు ప్రాంతాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రెడ్డిగూడెంలోని రహదారిపైనే హెలికాప్టర్‌ను దించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. 
 
రెడ్డి గూడెం ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయి ఉండటాన్ని గమనించిన చంద్రబాబు అక్కడే ల్యాండ్ చేయాలని పైలట్‌ను ఆదేశించారు. అక్కడ్నుంచి జిల్లా కలెక్టర్ కారులో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల దెబ్బ‌తిన్న రైల్వే ట్రాక్‌ల‌ను కూడా సీఎం ప‌రిశీలించారు. బాధితుల‌కు బాస‌ట‌గా నిలుస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ దాడులు - విజయమాల్యాతో కలిసి బిజినెస్‌ చేయడమే కారణమా...?