Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెట్టుబడిదారుల సమావేశం... ముంబైకి చంద్రబాబు..!

పెట్టుబడిదారుల సమావేశం... ముంబైకి చంద్రబాబు..!
, ఆదివారం, 1 మార్చి 2015 (18:00 IST)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ముంబై వెళ్లనున్నారు. అక్కడ సిటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం పెట్టుబడిదారులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సురక్షిత ప్రాంతమని, రాయితీలు, సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ఆయన పారిశ్రామిక వేత్తలకు సూచించనున్నారు. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తాము ఆశించిన ఎలాంటి రాయితీలు లభించని నేపథ్యంలో స్వంత క్రెడిబిలిటీపై పరిశ్రమలు రప్పించుకోవాలని చంద్రాబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు, పరిశ్రమల కల్పనకు ఉన్న సౌకర్యాలను ఆయన వారికి వివరించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu