Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి... కేబినెట్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి... కేబినెట్ నిర్ణయం
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:50 IST)
అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని పేరు అమరావతిగా ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో, కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన పారిశ్రామిక విధానం, మిగతా రాష్ట్రాలతో సమాన హోదా వచ్చే వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

 
రాష్ట్రానికి నిధులు విడుదల చేసినందుకు కేబినెట్ కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఇకపోతే పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేబినెట్ వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే భూములను 99 ఏళ్లు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలను సీఎం ఈ రోజు సాయంత్రం తెలుపుతారు.

Share this Story:

Follow Webdunia telugu