ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ.. వీటిలో ఏదైనా ఒక్కటే : ఏపీ బీజేపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీల్లో ఏది ఇచ్చినా ఒక్కటేనన్నవాదనను ఏపీ బీజేపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక శాఖ క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీల్లో ఏది ఇచ్చినా ఒక్కటేనన్నవాదనను ఏపీ బీజేపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ఏపీకి చెందిన బీజేపీ నేతలు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు.
బీజేపీ ఏపీ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత హరినాథ్ బాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ఇస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెర తీయనున్నాయి.
వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలన్న వాదన ఆ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఈ దిశగా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. తమ డిమాండ్ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో బీజేపీతో ఉన్న మైత్రి బంధాన్ని తెంచుకునేందుకు కూడా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ దాదాపుగా సిద్ధంగా ఉంది.