Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!

జగన్‌కు కడప జిల్లా నేతల షాక్.. ఆదినారాయణ బ్రదర్స్ పక్కచూపులు!
, గురువారం, 30 అక్టోబరు 2014 (13:15 IST)
జగన్ మోహన్ రెడ్డికి కడప జిల్లాలో కీలకంగా ఉన్న వైకాపా నేతలైన ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సోదరులు షాక్ ఇచ్చేలా ఉన్నారు. గురువారం జిల్లా పార్టీ విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు డుమ్మాకొట్టారు. వీరి గైర్హాజరీ పార్టీలో చర్చనీయాంశమైంది. వారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలువురు సీనియర్లు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో జగన్ సొంత జిల్లాకే చెందిన ఆదినారాయణ రెడ్డి సోదరులు ఉండటం గమనార్హం. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణలో రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీటీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీటీడీపీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. 
 
మరికొద్దిసేపట్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగత్‌ను నేతలు కలువనున్నారు. విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సైతం నేతలు కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu