Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్న చంద్రబాబు.. జగన్‌కు అండగా ఉంటాం : రఘువీరా

వైకాపా ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొంటున్న చంద్రబాబు.. జగన్‌కు అండగా ఉంటాం : రఘువీరా
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:40 IST)
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మందలో గొర్రెలను కొన్నట్టుగా వైకాపా ఎమ్మెల్యేలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్నారనీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. 
 
ఇదే అంశంపై రఘువీరా మాట్లాడుతూ అనైతికంగా ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం వారి ముర్ఖాత్వానికే నిదర్శనమన్నారు. ఏపీశ్‌లో వైఎస్సార్‌ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు డబ్బులు ఎరచూపి పశువులు, గొర్రెల్లా కొంటున్నాడన్నారు. ఇది అనైతికత చర్యగా అభివర్ణించారు. జగన్‌ తన పార్టీని మూసేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు అది వేరే పార్టీ నాయకుడి విషయం అంటూ దాటవేశారు. 
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2019 నాటికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందన్నారు. ప్రజలు బీజేపీని, టీడీపీని నమ్మలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతున్నపుడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.5 లక్షల కోట్లు ఇస్తామని అపుడు ప్రభుత్వం చెపితే, బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నదని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో యువకుడి మాటలు నమ్మి భర్తను కడతేర్చిన భార్య.. ఎక్కడ?