Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ రాజధానిపై ప్రకటన : గురువారం 12.17 నిమిషాలకు...

ఏపీ రాజధానిపై ప్రకటన : గురువారం 12.17 నిమిషాలకు...
, బుధవారం, 3 సెప్టెంబరు 2014 (08:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రాంతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అధికారపూర్వక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం మంచి శుభ ముహుర్తంలో అంటే దశమి గురువారం 12.17 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజధాని ఎంపిక ప్రాంతంపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. 
 
వాస్తవానికి ఈ సస్పెన్స్ ముందుగా అనుకున్న ప్రకారం అయితే మంగళవారమే వీడిపోవాల్సి వుంది. అయితే మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. పైగా తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇడుపులపాయకి వెళ్ళారు. ఆయన లేకుండా ప్రకటించడం భావ్యం కాదని కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు శాసనసభలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. విజయవాడ - గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu