Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రెండు ఎమ్మెల్సీలూ టీడీపీ ఖాతాలోకే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రెండు ఎమ్మెల్సీలూ టీడీపీ ఖాతాలోకే
, మంగళవారం, 7 జులై 2015 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా స్థానానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ నేతలు విజయం తమదంటే, కాదు గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ... చివరకు విజయం మాత్రం శిల్పా చక్రపాణిరెడ్డిని వరిచింది. ఫలితంగా ఆయన సమీప వైకాపా ప్రత్యర్థి వెంకటేశ్వర రెడ్డిపై 120 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 
 
అలాగే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. దీంతో స్థానిక కోటా కింద భర్తీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీడీపీ ఖాతాలోకి చేరాయి. ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందుగానే వైకాపా పోటీ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu