Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల!
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (12:14 IST)
ఆంధ్రప్రదేశ్‌ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మంగళవారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను మంగళవారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి కర్నూలు జిల్లాలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా ప్రధమ సంవత్సరంలాగానే బాలికలే ముందంజలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ బోర్డు వెల్లడించిన ఇంటర్ ఫలితాలను, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాదులో సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. 
 
ఈ పరీక్షలకు ఒకేషనల్ రెగ్యులర్‌లో 3,78,973 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu