Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ను చదువుకోమని అమెరికా పంపిస్తే తిరుగు టపాలా వచ్చాడు : సభలో చంద్రబాబు

జగన్‌ను చదువుకోమని అమెరికా పంపిస్తే తిరుగు టపాలా వచ్చాడు : సభలో చంద్రబాబు
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:46 IST)
ఉన్నత చదువులు చదువుకోమని అమెరికాకు పంపిస్తే.. తిరుగు టపాలో ఇండియాకు వచ్చేశారని వైకాపా అధినే, ఏపీ అసెంబ్లీ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. 
 
వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. 
 
ఆ సమయంలో జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఉన్నత చదువుల కోసం జగన్‌ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమెరికాకు పంపిస్తే... తిరుగు టపాలో స్వదేశానికి వచ్చారని, కానీ తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని తిరిగి వచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారి నవ్వులు పూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu