Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యోటో నుంచి ఫుకువోకాకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు బృందం!

క్యోటో నుంచి ఫుకువోకాకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు బృందం!
, మంగళవారం, 25 నవంబరు 2014 (17:05 IST)
జపాన్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ రైలులో బాబు క్యోటో నుంచి ఫుకువొకా వెళ్లారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు కూడా బాబుతో పాటు బుల్లెట్ ట్రైన్ ప్రయాణాన్ని ఆస్వాదించారు. 
 
మరోవైపు... జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టబడులు పెట్టాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఏపీల గల అవకాశాలు, రాయితీలను బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu