Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తపల్లి బాణాసంచా పేలుడు బాధితులను పరామర్శించిన చంద్రబాబు!

కొత్తపల్లి బాణాసంచా పేలుడు బాధితులను పరామర్శించిన చంద్రబాబు!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (17:00 IST)
కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. అలాగే క్షతగాత్రుల కుటుంబాలను కూడా ఆయన ఓదార్చారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడకు వెళ్లారు. 
 
ముందుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని బాబు చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. మరోవైపు బాణాసంచా ఘటనలో మంగళవారం ఉదయానికి 16కు చేరింది. మరో ముగ్గురు స్థానిక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu