Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని ఏర్పాటుపై అఖిలపక్ష నిర్ణయం తీసుకోవాలి.. తులసిరెడ్డి

రాజధాని ఏర్పాటుపై అఖిలపక్ష నిర్ణయం తీసుకోవాలి.. తులసిరెడ్డి
, ఆదివారం, 23 నవంబరు 2014 (15:23 IST)
ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాజధాని భూసేకరణ అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు.
 
ముందు రైతులు, రైతు కూలీలు గురించి ఆలోచించాలని.. రాజధాని పేరుతో ఏదో హైప్ క్రియేడ్ చేయడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu