Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవిర్భావం దినోత్సవం సాక్షిగా తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

ఆవిర్భావం దినోత్సవం సాక్షిగా తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!
, ఆదివారం, 29 మార్చి 2015 (16:29 IST)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ ఘటన అనంతపురంలో జరిగిన తెలుగుదేశం సమీక్ష సమావేశంలో జరిగింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్‌ స్వరూప వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. పరస్పరం దుర్భాష లాడుకుంటూ, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 
 
ఇదంతా రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగువులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు తన్నుకుంటుంటే.. మరోవైపు.. పోలీసులు వినోదం చూస్తూ మిన్నకుండి పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu