Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తహశీల్దారుపై ‘అధికార’ దాడి... టిడిపి నాయకులపై కేసు నమోదు

తహశీల్దారుపై ‘అధికార’ దాడి... టిడిపి నాయకులపై కేసు నమోదు
, శుక్రవారం, 27 మార్చి 2015 (09:05 IST)
తాము చెప్పిన పనులు చేయడానికి నిరాకరించిన రెవెన్యూ అధికారిపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేశారు. చివరకు ఆయనపై దాడి చేశారు. తాము చెప్పిన వారికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు నిరాకరించారని మండిపడుతూ ఈ చర్యకు పాల్పడ్డారు. అనంతపురంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పరిటాల సునీత అనుచరులు టీడీపీ నేతల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర బుధవారం ఉదయం తహశీల్దార్‌ షేక్‌మహబూబ్ బాషాను కలిసేందుకు వచ్చారు. తాము చెప్పినా పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ ఆయనతో వాదనకు దిగారు. నిబంధనల ప్రకారం రద్దు చేయాల్సి వచ్చిందన్న ఎమ్మార్వో సమాధానానికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక టీడీపీ నేత శ్రీనివాస్ ఎమ్మార్వోపై దాడి చేశారు.
 
ఎమ్మార్వో మహబూబ్బాషాపై దాడికి పాల్పడిన టీడీపీ నేత శ్రీనివాస్పై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. ప్రభుత్వ ఆధికారులపై దాడులకు పాల్పడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu