జగన్కు బడితె పూజ తప్పదు: ఆనం రామనారాయణ జోస్యం
సీఎం చంద్రబాబును విలన్ అంటూ జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే బడితె పూజ తప్పదని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.
సీఎం చంద్రబాబును విలన్ అంటూ జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే బడితె పూజ తప్పదని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. పైగా, రాష్ట్రానికి జగనే అసలైన విలన్ అని, ఆయన ఎప్పటికీ హీరో కాలేరన్నారు.
జగన్ హావభావాలు చూస్తే విలనే గుర్తుకొస్తారని అన్నారు. 24 రీళ్లు పూర్తయినా జగన్కు జ్ఞానోదయం కాలేదని ఎద్దేవా చేశారు. మిగతా 36 రీళ్లు అయ్యాక మరోసారి చంద్రబాబును హీరో చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రౌడీ గ్యాంగ్ నాయకుడిగా ఉన్న జగన్కు వచ్చే ఎన్నికల్లో బడితెపూజ తప్పదని, జగన్కు మైనస్ మార్కులు రావడం ఖాయమన్నారు.
దేశంలోనే అతిపెద్ద విలన్ జగన్ అని, అందరిపై లేనిపోని బురద చల్లుతూ తన మూర్ఖత్వాన్ని చాటుకుంటున్నాడన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా అహంకారంతో కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నాడని మంత్రి రఘునాథ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవడానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.